Sign in or 

|
ravichandvidampally |
telugodi avedana!
Sep 9 2008, 3:38 AM EDT
ఒక సిలికానాంధ్ర అభిమాని స్పందన! ఒక్క తరం కింద చెప్పలేనంత బీదరికం. సుజనరంజనిలో `మన వాళ్ళూ, `నాన్నకి జేజేలూ కధల నిండా ఈ కటిక బీదరికం, జీవన పోరాటం కనబడుతుంది. మన తల్లితండ్రులూ, వారి పూర్వీకులూ సరస్వతిని నమ్ముకున్నారు. తినడానికి లేకపోయినా పిల్లలని చదివించారు. గుట్టుచప్పుడు కాకుండా సంసారాన్ని నెట్టుకొచ్చారు. ఆ చదువులతో ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు వీరవిహారం చేస్తున్నారు. ఆర్ధికంగా మునపటి కంటే ఎదిగాం. కాని, ఈ చదువులు సంస్కారాన్ని ఇవ్వలేదు. మొగుడూ, పెళ్ళం ఇద్దరూ పీ.ఎచ్.డీ లే. కాని, పట్టుమని పదిరోజులు కాపరం చెయ్యలేకపోతున్నారు. క్షణాల మీద విడిపోతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. చదివిన చదువుల ప్రభావం. వేమన తెలియదు. విదురుడు తెలియదు. ధర్మం అనే మాట వాడుకలోంచి ఎగిరి పోయింది. ఒక్క ముప్పై ఏళ్ళ క్రితం అది మహా శక్తివంతమైన మాట. తరచు ఆడవారు, మగవారు ఏదో రూపంలో `ధర్మం' అనే మాటని వాడేవారు. ఆఖరికి పిచ్చాపాటీ మాటల్లో కూడా దొర్లేది. వెనకటి తరాలలో కనబడే ఓపిక, ఒద్దిక, సౌమ్యత, మనో సౌందర్యం కావాలి మనకి. ఇంగ్లీషు చదువులలో మనస్సుని వికసింపచేసే శక్తి లేదు. అది వేమన పద్యంలో వుంది. సుమతీ శతకంలో వుంది. విదుర నీతిలో వుంది. మనకున్న క్రియాశక్తినీ, ఆర్ధికశక్తినీ ఉపయోగించి ఇప్పుడు మన భాషనీ, కళళనీ మనం రక్షించుకోవాలి. మన బడి ద్వారా వేమన పద్యాలు, సుమతీ శతకం బతుకుతాయి. అవి నేర్చుకున్న మన పిల్లల్లో సంస్కారం ప్రవేశించి తీరుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళై ప్రకాశిస్తారు. భాశిస్తారు. అదే మన బడికి రాబడి. అనకాపల్లిలో పెరుగుతున్నవాడు నాకు మా తెలుగు మాష్టారు సరిగ్గా చెప్పడంలేదు. సిలికానాంధ్ర మన బడిలో చేరతాను. వాళ్ళ తెలుగు స్వచ్చంగా, తియ్యగా వుంటుంది అంటాడు. , దాని ఫలితం తెలుగు భాష జీవించి వున్నంత కాలం మిగిలి పోతుంది. ముందు తరాలు కీర్తిస్తాయి. వేదమంత్రాలలాగ, బుద్ధుడి శాంతి గీతాలలాగ భాష చిరస్థాయిగా నిలిపే మార్గాలు వెదుకుదాం' అని రాసాను ఒక చోట. అయ్యా! ఏం చెప్పను. మనసు మూగపోతోంది. కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. చేసి చూపిస్తున్నారు! -సిలికానాంధ్ర అభిమాని Do you find this valuable?
Keyword tags:
telugu bhasha
|